- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్లో వారణాసి షూటింగ్.. నెక్స్ట్ ప్లానేంటో తెలుసా?
ప్రస్తుతం వారణాసి చిత్ర షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే చిత్ర బృందం కొద్దిరోజుల విరామం తీసుకోనున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఇండియన్ చిత్రాల్లో ‘వారణాసి’ మొదటి స్థానంలో నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుండగా, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్కు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పాల్గొంటున్నారు.
ఈ షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే చిత్ర బృందం కొద్దిరోజుల విరామం తీసుకోనున్నట్లు సమాచారం. ఆ గ్యాప్లో మహేష్ బాబు విదేశాలకు వెకేషన్కు వెళ్లనున్నట్లు తెలుస్తుండగా, రాజమౌళి తన కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. వీరంతా తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన సుమారు 80% షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్ను రెండు భాగాలుగా విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు, అందుకు అనుగుణంగానే ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.






