ఆ దర్శకుడికి మరో అవకాశం ఇచ్చిన యూవీ క్రియేషన్స్

by Pulgam srinivas |

కపుల్ ఫ్రెండ్లీ మూవీ దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తన రెండవ సినిమాను కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లోనే చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఆ దర్శకుడికి మరో అవకాశం ఇచ్చిన యూవీ క్రియేషన్స్
X

దిశ, వెబ్ డెస్క్: సంతోష్ శోభన్ హీరోగా, మానస వారణాసి హీరోయిన్‌గా, అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో ‘కపుల్ ఫ్రెండ్లీ’ అనే చిత్రం రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించారు. కొంతకాలం క్రితం విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారానే దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించిన అశ్విన్ చంద్రశేఖర్‌కు కూడా ఈ సినిమా మంచి గుర్తింపును తీసుకువచ్చింది. దాంతో ఆయన తన తదుపరి చిత్రాన్ని ఎవరితో చేయబోతున్నారనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో పెరిగింది.

తాజాగా ఆయన తదుపరి చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దర్శకుడు తన రెండవ సినిమాను కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లోనే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా లాక్ అయినట్లు, ఆ కథకు తగిన హీరో కోసం మూవీ బృందం వెతుకులాటను ప్రారంభించినట్లు సమాచారం. ‘కపుల్ ఫ్రెండ్లీ’ సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్న దర్శకుడు కావడంతో, ఆయన తదుపరి చిత్రంపై కూడా మంచి అంచనాలు నెలకొనే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story