బుమ్రా-విరాట్ కోహ్లీ- అయ్యర్‌పై టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఎమోషనల్ పోస్ట్..

by Kodari Anjali |   (  Updated:2025-06-02 12:04:08  IST  )

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

బుమ్రా-విరాట్ కోహ్లీ- అయ్యర్‌పై టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఎమోషనల్ పోస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇప్పటివరకు ఈ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయినవేనని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జక్కన్న తెరకెక్కించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలైతే ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయాయి. ఈ సినిమాలు రాజమౌళికి మరింత గొప్ప పేరును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఈ టాలీవుడ్ దర్శకధీరుడు సూపర్‌స్టార్ మహేష్ బాబుతో జతకట్టాడు. వీరిద్దరి కాంబోలో బ్లాక్ బస్టర్ హిట్ రాబోతుంది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఇకపోతే రాజమౌళి తాజాగా సోషల్ మీడియా వేదికపై ఓ బుమ్రా-విరాట్ కోహ్లీపై పోస్ట్ పెట్టారు. ‘‘బుమ్రా అండ్ బౌల్ట్ యార్కర్లను అయ్యర్ థర్డ్ మ్యాన్ బౌండరీకి ​​నడిపించారు.అద్భుతంగా అనిపించింది. ఈ వ్యక్తి ఢిల్లీని ఫైనల్‌కు నడిపించాడు. అలాగే తొలగించబడ్డాడు. ఇక కోల్‌కతాను ట్రోఫీకి నడిపించాడు. తొలగించబడ్డాడు. 11 సంవత్సరాల తర్వాత యువ పంజాబ్‌ను ఫైనల్‌కు నడిపించాడు.

ఈ సంవత్సరం ట్రోఫీకి కూడా అతను అర్హుడు. మరోవైపు, కోహ్లీ... సంవత్సరం తరబడి ప్రదర్శన ఇస్తున్నాడు. వేల పరుగులు సాధిస్తున్నాడు. అతనికి చివరి సరిహద్దు.. అతను కూడా దానికి అర్హుడు. ఫలితం ఏదైనా... అది హృదయ విదారకంగా ఉంటుంది’’. అని రాజమౌళి పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇక ముంబయి ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో అయ్యర్ అద్బుతమైన బ్యాటింగ్‌తో పంచాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చిన విషయం తెలిసిందే. ఇక బుమ్రా బౌలింగ్‌లో అతడు కొట్టిన యార్కర్ షాట్ హైలెట్‌గా నిలిచిందని చెప్పుకోవచ్చు.

Next Story