- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాక్షన్ మోడ్లోకి టాలీవుడ్ క్యూట్ బ్యూటీస్.. ప్రేక్షకులను మెప్పించగలరా?
మాస్ పాత్రలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిన సమంత, రష్మిక, సంయుక్తా మీనన్.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చిన తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం సాధారణమే. కానీ పూర్తి స్థాయి మాస్ యాక్షన్ సినిమాల్లో మహిళా ప్రధాన పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రం చాలా అరుదు. ఈ ట్రెండ్లో గతంలో విజయశాంతి లాంటి కొద్దిమంది మాత్రమే భారీ స్థాయిలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే దారిలో ముగ్గురు స్టార్ హీరోయిన్లు అడుగులు వేస్తున్నారు.
సమంత
సమంత ఇప్పటికే కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో తన సత్తా చాటింది. ఇప్పుడు “మా ఇంటి బంగారం ” సినిమాలో పూర్తి మాస్ అవతారంలో కనిపించబోతోంది. ఈ సినిమా కోసం యాక్షన్ సన్నివేశాల్లో కూడా సమంత బాగా కష్టపడినట్టు సమాచారం.
రష్మిక మందన్న
రష్మిక కెరీర్ ప్రారంభంలో రొమాంటిక్, కమర్షియల్ సినిమాలతో మెప్పించిన ఈమె, ఇప్పుడు “మైసా” అనే పవర్ ఫుల్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటివరకు వచ్చిన ప్రచార చిత్రాలను చూస్తే ఇది హై వోల్టేజ్ యాక్షన్ మూవీ అని స్పష్టంగా తెలుస్తోంది.
సంయుక్తా మీనన్
ఈ నటి ప్రస్తుతం “ది బ్లాక్ గోల్డ్” సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇందులో ఈమె పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతోంది. మాస్ రోల్లో ఈమె ప్రెజెన్స్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి పెరిగింది.
మొత్తానికి, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముగ్గురు హీరోయిన్లు ఇప్పుడు యాక్షన్, మాస్ పాత్రలతో తమ ఇమేజ్ను మరో లెవల్కి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సినిమాలు హిట్ అయితే వీరికి ప్రత్యేకమైన మాస్ క్రేజ్ ఏర్పడే అవకాశముంది.






