పూరి ఫ్యాన్స్​కు సూపర్ గుడ్ న్యూస్.. ఒకేసారి 4Kలో మూడు సినిమాలు

by Pulgam srinivas |

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి, పోకిరి సినిమాలను మరికొన్ని రోజుల్లో 4K వర్షన్‌లో రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

పూరి ఫ్యాన్స్​కు సూపర్ గుడ్ న్యూస్.. ఒకేసారి 4Kలో మూడు సినిమాలు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకరు. ఈయన దర్శకుడుగా కెరీర్ను ప్రారంభించి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి చాలా మూవీలతో విజయాలను అందుకొని తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా చాలా సంవత్సరాలు కొనసాగారు. ఈయనకు బయట జనాలు మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.

బ్రతికితే పూరి జగన్నాథ్ లాగా బ్రతకాలి, ఆయన దేనినీ పెద్దగా పట్టించుకోరు. హిట్ వచ్చిన, ఫెయిల్యూర్ వచ్చిన వెంటనే వదిలేసి కొత్త విషయంలోకి వెళతారు. ఆయనలా ఉండడం అంత ఈజీ కాదు అని అనేకమంది ఇండస్ట్రీకి సంబంధించిన వారు కూడా చాలా సందర్భాలలో అన్నారు. గొప్ప గుర్తింపును దర్శకుడిగా సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ఈ మధ్యకాలంలో మాత్రం మంచి సినిమాలు ఎక్కువగా తీయడం లేదు. ఆఖరుగా ఈ డైరెక్టర్ డబుల్ ఇస్మార్ట్ అనే మూవీని రూపొందించాడు.

ఇది భారీ డిజాస్టర్ అయింది. గత కొంతకాలంగా పెద్ద ఎత్తున సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొంది అద్భుతమైన విజయాలను సాధించిన మూడు సినిమాలను 4Kలో రీ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి చిత్రాలను మరికొన్ని రోజుల్లోనే 4K వర్షన్లో రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మూడు సినిమాలను రీ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేయడంతో పూరి జగన్నాథ్ అభిమానులు ఫుల్ ఖుషి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అనేకమంది అభిప్రాయపడుతున్నారు.

Next Story