BRO ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్.. చీఫ్ గెస్ట్‌లు వీరే.. మరి పవన్..?

by Disha Web Desk 7 |
BRO ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్.. చీఫ్ గెస్ట్‌లు వీరే.. మరి పవన్..?
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘బ్రో’. డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. ఇక తాజాగా టీజర్ కూడా రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. విడుదలైన 19 గంటల్లోనే 17 మిలియన్ల వ్యూస్ సాధించి సోషల్ మీడియా రికార్డులను బ్రేక్ చేస్తుంది.

ఇక తాజా సమాచారం మేరకు సినిమా రిలీజ్ సమయం కూడా దగ్గర పడటంతో ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మొన్నటి వరకు ఈ ఈవెంట్‌ను ఏపీలోని రాజమండ్రిలో నిర్వహించాలని అనుకున్నప్పటికీ.. ఇప్పుడు హైదరాబాద్‌లో చేయాలని భవించారట. అయితే ఈ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ రాకపోవచ్చని టాక్. అంతేకాకుండా.. అందుతున్న సమాచారం మేరకు చిరంజీవి, రామ్ చరణ్‌లు చీఫ్ గెస్ట్‌లుగా వస్తున్నారట. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ‘బ్రో’ మూవీ జూలై-28 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read..

Tamannaah : ఆ ఒక్క విషయం నన్ను ఎక్కువగా బాధిస్తుంది

Next Story

Most Viewed