- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Chiranjeevi: బాక్సాఫీస్ను షేక్ చేసిన మెగాస్టార్.. 35 ఏళ్ల తర్వాత కూడా అదే క్రేజ్

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా స్టార్ హీరోల సినిమాలు మరోసారి థియేటర్స్లోకి వస్తున్నాయి. గతంలో డిజాస్టర్ అయిన చిత్రాలు కూడా రీరిలీజ్లో అత్యధిక కలెక్షన్లు సాధించి పలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటించిన ‘జగదీక వీరుడు అతిలోక సుందరి’ (JagadekaVeeruduAthilokaSundari )మే9న థియేటర్స్లో విడుదలైన విషయం తెలిసిందే. 1990లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో థియేటర్లలో సంచలనం సృష్టించింది. అయితే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో చిరంజీవి, దివంగత నటి శ్రీదేవి(Sridevi) జంటగా నటించారు.
ఇక సోషియో ఫాంటసీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను వైజయంతీ మైవీస్ బ్యార్పై అశ్వనీదత్ నిర్మించారు. అయితే ఈ మూవీ విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసు వద్ద రికార్డులను తిరగరాసింది. ఇక మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ రెస్పాన్స్తో దూసుకుపోతుంది. 2d, 3dలో విడుదలైన ఈసినిమా మరోసారి బాక్సాఫీసును షేక్ చేస్తోంది. తాజాగా, ఈ విషయాన్ని తెలుపుతూ మూవీ మేకర్స్ ఓ పోస్టర్ను షేర్ చేశారు. మొదటి రోజే ఈ సినిమా వరల్డ్ వైడ్గా ఏకంగా రూ. 175 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు అధికారికంగా వెల్లడించారు. ఇక అది చూసిన వారంతా ఈ మూవీ వచ్చి 35 ఏళ్లు వచ్చినప్పటికీ ఆయన క్రేజ్ తగ్గలేదని మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.