BREAKING: రాజాసాబ్ టికెట్ రేట్లు భారీగా పెంపు..

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-07 12:21:43  IST  )

రాజాసాబ్ టికెట్ ధరలను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

BREAKING: రాజాసాబ్ టికెట్ రేట్లు భారీగా పెంపు..
X

దిశ, వెబ్‌డెస్క్: రాజాసాబ్ టికెట్ ధరలను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 9న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుండగా.. రేపు (జనవరి 8) ప్రీమియర్ షోలు పడనున్నాయి. ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.1000గా నిర్ణయించింది. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల లోపు స్పెషల్ షోలకు అనుమతినిస్తూ జీఓ జారీ చేసింది. జనవరి 9 నుంచి 10 రోజుల పాటు టికెట్ రేట్లను పెంచుకునేందుకు చిత్రయూనిట్ కు పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులిచ్చింది. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.150, మల్టీప్లెక్సుల్లో టికెట్ పై రూ.200 వరకూ పెంచుకునేలా పర్మిషన్ ఇచ్చింది. దీంతో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ.350 - రూ.400, మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర రూ.450 -550 వరకూ ఉండనున్నాయి. అలాగే రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ సంక్రాంతికి రాజాసాబ్ టీమ్ బిగ్ హిట్ కొట్టాలని ప్లాన్ చేసింది.

ఆ స్థాయిలో కలెక్షన్లు సాధ్యమేనా?

మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన తొలి హారర్ ఫాంటసీ మూవీ ఇది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ లు నటించారు. ప్రభాస్ కు తాత క్యారెక్టర్లో సంజయ్ దత్ కనిపించనున్నారు. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ను అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ది రాజాసాబ్ విజయం సాధించాలంటే తెలుగులో రూ.300 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల కలెక్షన్లు రాబట్టాలి. సంక్రాంతి బరిలో ఉన్న సినిమా కావడంతో రాజాసాబ్ కు ఆ స్థాయిలో కలెక్షన్లు వస్తాయా అన్న ప్రశ్న ఉంది. బాక్సాఫీస్ వద్ద రాజాసాబ్ అదృష్టం ఎలా ఉందో చూడాలి.

Next Story