సమయం ఆసన్నమైంది.. మౌనం వీడింది అంటూ D-55 నుంచి వరుస్ అప్డేట్స్ ఇస్తున్న మేకర్స్

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం తన కెరీర్‌లో రాబోతున్న 55వ చిత్రంతో బిజీగా ఉన్నాడు.

సమయం ఆసన్నమైంది.. మౌనం వీడింది అంటూ D-55 నుంచి వరుస్ అప్డేట్స్ ఇస్తున్న మేకర్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం తన కెరీర్‌లో రాబోతున్న 55వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ‘D-55’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ‘అమరన్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పూజాకార్యక్రమాలు కంప్లీట్ కాగా.. ప్రస్తుతం షూటింగ్‌లో వేగం పెంచారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇందులో నటించబోయే నటీనటులకు సంబంధించి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ మేరకు సంతగీ దర్శకుడు సాయి అభ్యంకర్, యంగ్ బ్యూటీ శ్రీలీల, సూపర్ స్టార్ మమ్ముట్టిని బోర్టులోకి ఆహ్వానిస్తూ పోస్టర్లు షేర్ చేశారు. ‘సమయం ఆసన్నమైంది.. మౌనం వీడింది!!’ అంటూ షేర్ చేసిన ఈ పోస్టర్స్ ప్రజెంట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Next Story