తెలుగు ఆడియన్స్ స్పెషాలిటీ అదే.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్ వైరల్

by Chukka Sudharani |

మౌంట్ మెరు పిక్చర్స్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ క్రేజీ ఎంటర్‌టైనర్‌ ‘జిగ్రీస్’.

తెలుగు ఆడియన్స్ స్పెషాలిటీ అదే.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: మౌంట్ మెరు పిక్చర్స్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ క్రేజీ ఎంటర్‌టైనర్‌ ‘జిగ్రీస్’. కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జిగ్రీస్ నవంబర్ 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్యఅతిథిగా హాజరైన సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

‘ఇలాంటి సినిమా చేయడానికి యూనిట్ అందరికీ ఒక పిచ్చి కావాలి. సినిమా మ్యూజిక్ చార్ట్ బస్టర్ అయ్యింది. సినిమా కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. సెన్సార్, ప్రివ్యూ రిపోర్ట్స్ జనరల్ చాలా జెన్యూన్‌గా అనిపించింది. అది థియేటర్స్‌లో కూడా ట్రాన్స్‌ఫర్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా పిచ్చితో కష్టపడి తీశారు. అర్జున్ రెడ్డి నేను ఎలా తీశాను అంతకంటే ఎక్స్ట్రీమ్ గా తీశారు. దానికోసం అయినా సినిమా బాగా ఆడాలి. హీరో డైరెక్టర్‌తో సంబంధం లేకపోయినా ఏదో ఒక ఎలిమెంట్ నచ్చితే ఆడియన్స్ థియేటర్స్‌కి వెళ్లి చూస్తారు. అది మన తెలుగు ఆడియన్స్ స్పెషాలిటీ. ఈ సినిమా కూడా థియేటర్స్లోకి వెళ్లి చూడాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమాకి సక్సెస్ మీట్ కూడా ఉంటుందని అనుకుంటున్నాను. థియేటర్స్ ఫిల్ అవుతున్నాయి. అన్నీ అద్భుతంగా ఉన్నాయి. అందరికి గుడ్ లక్’ అని తెలిపాడు.

Next Story