‘అఖండ 2’ కలెక్షన్స్ సునామీ.. నిర్మాతల ప్రకటన

by Sujitha Rachapalli |

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘అఖండ 2 : తాండవం’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమాకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తున్నట్లు సక్సెస్ సెలబ్రేషన్స్‌లో తెలపారు. బుకింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయని

‘అఖండ 2’ కలెక్షన్స్ సునామీ.. నిర్మాతల ప్రకటన
X

దిశ, సినిమా : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘అఖండ 2 : తాండవం’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమాకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తున్నట్లు సక్సెస్ సెలబ్రేషన్స్‌లో తెలపారు. బుకింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయని.. సినిమాకి ట్రెమండస్ రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్‌కు థాంక్స్ చెప్పారు. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా ఒక వారం రోజులు వాయిదా పడిందని.. ఈ సందర్భంగా బాలయ్య బాబు, డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఫ్యాన్స్‌కు తమ ప్రొడక్షన్ తరఫున సారీ చెప్పారు. ఈ సమస్యని పరిష్కరించడానికి మ్యాంగో మీడియా రామ్ గారు, నిర్మాత దిల్ రాజు గారు చాలా సపోర్ట్ చేశారని.. వారికి ధన్యవాదాలు చెప్పారు. ఒక వారం రోజులు ఆలస్యం అయినప్పటికీ డిసెంబర్ 12న ఈ సినిమా ప్రీమియర్స్‌తో రిలీజ్ అయిందని.. ప్రీమియర్స్‌కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చిందన్నారు.

భ్రమరాంబంలో సినిమా చూశామని.. ఫ్యాన్స్ అసలు సీట్లో కూర్చోవడం లేదన్నారు. నిలుచుని చప్పట్లు విజిల్స్‌తో అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారని.. మార్నింగ్, మ్యాట్నీ షోలు కూడా అద్భుతంగా ఉన్నాయన్నారు. అన్ని ఏరియాల నుంచి మంచి కలెక్షన్స్, రిపోర్ట్స్ వస్తున్నాయని.. నార్త్‌లో జి సినిమాస్ ద్వారా దాదాపు 800 స్క్రీన్స్ లో రిలీజ్ చేశామని.. అక్కడ ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయన్నారు. సినిమాకి వర్డ్ ఆఫ్ మౌత్ బ్రహ్మాండంగా ఉందని.. సూపర్ ట్రెండ్‌లో టికెట్స్ బుక్ అవుతున్నాయని.. అందుకే రెండు రాష్ట్రాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. రాత్రి జరిగిన ప్రీమియర్స్ కి నైజాం సీడెడ్ ఆంధ్ర కలిపి 10 కోట్లు గ్రాస్.. కర్ణాటకలో కూడా దాదాపు కోటి రూపాయలు కలెక్ట్ చేసినట్లు తెలిపారు.

Next Story