- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HHVM: ఇద్దరు ముఖ్యమంత్రులతో పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న హరిహర వీరమల్లు చిత్రం కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దిశ, వెబ్డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న హరిహర వీరమల్లు చిత్రం కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల రిలీజైన ట్రైలర్ మరింత హైప్ పెంచడంతో రోజూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ హంగామా చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. హరిహర వీరమల్లు సినిమా మీద పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రీరిలీజ్ ఫంక్షన్కు రావడం తప్ప.. ఏ సినిమా ప్రమోషన్స్లో ఆయన పాల్గొన్నది లేదు. కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా ప్రమోట్ చేయడం చూడలేదు. కానీ హరిహర వీరమల్లు విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో స్వయంగా ట్రైలర్ వీడియోను పోస్టు చేశారు.
అంతేకాదు.. రెండు ప్రీరిలీజ్ ఫంక్షన్లో పాల్గొనాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, యూపీలోని వారణాసి.. ఈ రెండు వేదికల్లో ప్రీరిలీజ్ ఫంక్షన్ నిర్వహించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వారణాసి ఫంక్షన్కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath), తిరుపతి ఫంక్షన్కు ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) గెస్టులుగా హాజరు అవుతారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ వార్తలు నిజం కావాలని సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ అందరి దేవుళ్లను వేడుకుంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే చిత్రబృందం స్పందించి తీరాల్సిందే.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. నిధి అగర్వాల్, బాబీ డియోల్, నోరా ఫతేహి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకోవడంతో పాటు పలుమార్లు వాయిదా పడిన హరిహర వీరమల్లు మూవీ అన్ని అవాంతరాలను దాటుకుని జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. వీడియో






