మహేశ్ బాబు సినిమాలో పవన్ కల్యాణ్.. త్రివిక్రమ్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా?

by Disha Web Desk 6 |
మహేశ్ బాబు సినిమాలో పవన్ కల్యాణ్.. త్రివిక్రమ్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘గుంటూరు కారం’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా నటిస్తుండగా.. హారిక హాసిని బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా సమాచారం ప్రకారం.. మహేష్ బాబుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో త్రివిక్రమ్ పవన్ గొంతును వినిపించడానికి ప్లాన్ చేస్తున్నాడట. పవన్ అయితే కథ పరంగా చూస్తే వాయిస్‌ను బాగా చెబుతూ కథలోకి తీసుకు వెళ్తే సినిమాకు మరింత ప్లస్ అవుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడని తెలుస్తోంది. ప్లాన్ ప్రకారం పవన్‌ను కూడా దీనికి ఒప్పించారట. కాగా గతంలో జల్సా సినిమా కోసం మహేష్ వాయిస్ ఓవర్ చెప్పడంతో చాలా ప్లస్ అయింది. దీంతో ఇప్పుడు ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని డైరెక్టర్ త్రివిక్రమ్ ఇలా ప్లాన్ చేశాడట.

Read More: హీరో విశాల్ ‘మార్క్ ఆంటోని’ సినిమా ట్రైలర్ రిలీజ్.. (వీడియో)

Next Story