- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మళ్లీ వేణుస్వామి జోస్యం అట్టర్ ప్లాప్.. గట్టిగా ఏకిపారేస్తున్న నెటిజన్లు.. ఏం కామెడీ పీస్ బాబు నువ్వు.. ఇంకోసారి జోస్యం అన్నావంటే..

దిశ, ఫీచర్స్ : వేణుస్వామి మరోసారి దొరికిపోయాడు. భారత్-పాక్ యుద్ధం జరుగుతుందని తాను ముందుగానే చెప్పానంటూ బోర్డుతో సహా వచ్చేశాడు. పాత వీడియోలను రిఫర్ చేస్తూ పెద్ద విశ్లేషణే ఇచ్చాడు. యుద్ధంతో 80శాతం నాశనం అవుతుందని.. ప్రపంచ వ్యాప్తంగా గొప్ప నాయకులు, ప్రముఖ నటులు మరణిస్తారని జోస్యం చెప్పాడు. కానీ ఈ వీడియో రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే జోస్యం కాస్త ఫ్లాప్ అయిపోయింది. ఇండియా, పాకిస్తాన్ వార్ ముగిసిందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు.
దీంతో నెటిజన్లు వేణుస్వామిపై ఎటాక్ స్టార్ట్ చేశారు. యుద్ధం ఆపేశారుగా అని సెటైర్స్ వేస్తున్నారు. ప్రతీసారి ఆ బోర్డు పట్టుకుని వీడేంట్రా బాబు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ‘ వీడియో ముందే వేయాల్సింది బాబు.. వార్ ఆగిపోయే టైమ్కు రీలీజ్ చేశావేంటయ్యా..’, ‘ఈయన గారు పోస్టు వేశారు యుద్ధం ఆపేశారు’, ‘నీ బొందరా నీ బొంద.. నీ జోస్యం కామెడీ అయిపోయింది పో’, ‘ఏ ముహుర్తాన యుద్ధం జరుగుతుందన్నడో కానీ అప్పుడే ఆగిపోయింది’, ‘ఈయనపై డిబేట్ ఏయండి ఇక’, ‘నీ జోస్యం తగలెయ్యా’ అంటూ గట్టిగా ఏసుకుంటున్నారు.