పిల్లల విషయంలో లావణ్య త్రిపాఠి సంచలన నిర్ణయం.. ఆమెను ఫాలో కాబోతుందా?

by Disha Web Desk 6 |
పిల్లల విషయంలో లావణ్య త్రిపాఠి సంచలన నిర్ణయం.. ఆమెను ఫాలో కాబోతుందా?
X

దిశ, వెబ్‌డెస్క్: వరుణ్-లావణ్య ఇటీవల సడెన్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరికీ షాకిచ్చారు. నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి లావణ్య-వరుణ్‌లకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారాయి. తాజాగా, లావణ్య ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు న్యూస్ చక్కర్లు కొడుతోంది. రీసెంట్ గా ఆమె పిల్లల విషయంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగా కోడలు ఉపాసన ఏకంగా పదేళ్ల గ్యాప్ తీసుకుని పిల్లల్ని ప్లాన్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అదే పనిని లావణ్య త్రిపాఠి చేయబోతోందట. మెగా కోడలు కొన్ని సంవత్సరాల పాటు పిల్లలను వద్దనుకుంటుందని తెలుస్తోంది.

అంతేకాదు ఆమె మళ్ళీ సినిమాలో నటించాలని ఫిక్స్ అయిందట. అంతేకాకుండా కొత్తగా ఒక ప్రొడక్షన్ హౌస్ తో స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయిందట. అలాగే ఓ బ్రాండెడ్ డిజైనర్ షోరూమ్ కూడా ఓపెన్ చేయాలి అని సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ కి సంబంధించిన దుస్తులను తక్కువ ధరకే సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే విధంగా ఓ వెబ్సైట్ ని రన్ చేయబోతుందట. ఇలా తన లైఫ్ లో చాలా డ్రీమ్స్ ఉన్నాయని.. ఆ డ్రీమ్స్ ఫుల్ ఫిల్ అయ్యాకే పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలని డిసైడ్ అయిందట మెగా కోడలు. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు.. ఉపాసన పదేళ్లు తీసుకుంది.. నువ్వు ఏకంగా దాన్ని డబుల్ చేసి 20 ఏళ్లు తీసుకుంటావా ఏంటీ? అని అంటున్నారు.

Next Story

Most Viewed