మెగా అభిమానులకు ఊహించని షాక్ ఇవ్వబోతున్న లావణ్య త్రిపాఠి.. ఇక నుంచి వాటికి దూరం కానుందా?

by Disha Web Desk 6 |
మెగా అభిమానులకు ఊహించని షాక్ ఇవ్వబోతున్న లావణ్య త్రిపాఠి.. ఇక నుంచి వాటికి దూరం కానుందా?
X

దిశ, సినిమా: మెగా కోడలు లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ అమ్మడు వివాహ బంధంలోకి అడుగుపెట్టాక ఇండస్ట్రీకి కాస్త దూరమైంది. ఇటీవల లావణ్య త్రిపాఠి ‘మిస్ పర్‌ఫెక్ట్’ అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. ఇందులో చాలా సైలెంట్‌ కూల్ పాత్రలో కనిపించి అందరినీ తన నటనతో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే కొందరు ప్రశంసిస్తే.. మరికొందరు మాత్రం ఇలాంటివి అవసరమా కాపురం చేసుకోక? అని విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

అయినప్పటికీ ఇవన్నీ పట్టించుకోకుండా సినిమాల్లో నటిస్తానని ఖరాకండిగా చెప్పేసింది. కానీ ఆ తర్వాత ఏ కొత్త సినిమాను ప్రకటించలేదు. సోషల్ మీడియాలోనే పెద్దగా యాక్టీవ్‌గా ఉండట్లేదు. అయితే మెగా హీరో వరుణ్ తేజ్ మాత్రం వరుస చిత్రాల్లో నటిస్తూ.. ఫుల్ బిజీ అయిపోయాడు. ఇటీవల ఆయన నటించి ఆపరేషన్ వాలెంటైన్ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక డిజాస్టర్‌గా నిలిచింది.

ఇదిలా ఉంటే.. తాజాగా, వరుణ్-లావణ్య జంటకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లావణ్య-వరుణ్ పెళ్లి తర్వాత వచ్చిన మొదటి సినిమా ఆపరేషన్ వాలెంటైన్ డిజాస్టర్ కావడంతో నెటిజన్లు మెగా కొడలిది ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేశారు. ఈ క్రమంలోనే లావణ్య ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆమె.. ఇక నుంచి అన్నింటికీ దూరం కాబోతున్నట్లు టాక్. ఎందుకంటే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటే..తనపై వస్తున్న ట్రోల్స్, మీమ్స్ అన్ని చూసి బాధపడటం కంటే దూరం కావడమే మంచిదని నిర్ణయించుకుందట. అందుకే అప్పుడప్పుడు కూడా పోస్టులు పెట్టకుండా మొత్తానికి దూరం పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ అయితే ఇది నిజంగా ఊహించని షాక్ లావణ్య నిజంగానే ఇలా చేస్తుందా? అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read More..

కాలినడకన శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్



Next Story