నా పెళ్ళికి రావద్దు నిహారికకు ముఖం మీదే చెప్పేసిన లావణ్య.. ఏం జరిగిందంటే?

by Disha Web Desk 6 |
నా పెళ్ళికి రావద్దు నిహారికకు ముఖం మీదే చెప్పేసిన లావణ్య.. ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. త్వరలో మెగా ఫ్యామిలీ లో ఇప్పటికే పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి. ఇటీవల వరుణ్, లావణ్య ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కూడా జరిగింది.

ఇదిలా ఉంటే తాజాగా, నిహారికను తన పెళ్లికి రావొద్దని లావణ్య చెప్పినట్లు ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. స్ట్రైట్ గా నిహారిక మొహం మీదే నువ్వు మా పెళ్ళికి రావద్దు అని చెప్పిందట. పెళ్లికి వచ్చిన చాలామంది బంధువులు విడాకుల గురించి ఇతర విషయాల గురించి అడుగుతూ బాధ పెడతారని, వారి ముందు నేను ఎలా మొహం పైకెత్తుకొని సంతోషంగా తిరగలేను అంటూ ఇంట్లో ఈ విషయం చెప్పుకొని నిహారిక ప్రతిరోజూ ఏడుస్తుందట. అయితే ఈ విషయం తెలుసుకున్న లావణ్య త్రిపాఠి ఇంటికి వచ్చి నేరుగా నువ్వు ఇలా ఏడ్చుకుంటూ కూర్చుంటే మా పెళ్ళికి అస్సలు రావద్దు అంటూ స్ట్రైట్ గా మొహం మీదే చెప్పేసిందట.

ఎవరు ఏమంటారో అని వాళ్ల మాటలను తలుచుకుంటూ కూర్చుంటే నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళలేవు. ఇలా నువ్వు ఏడ్చుకుంటూ ఇంట్లో ఓ మూలన కూర్చోవడం ఏమాత్రం బాలేదు నువ్వు మళ్ళీ ఎప్పటిలాగే హ్యాపీగా తిరగక పోతే ఏ మాత్రం బాగుండదు అంటూ నిహారికకి లావణ్య త్రిపాఠి చెప్పి వెళ్ళిపోయిందట. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Next Story

Most Viewed