నాగ వంశీ బ్యానర్‌లో కిరణ్ అబ్బవరం

by Pulgam srinivas |

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో కిరణ్ అబ్బవరం తన తదుపరి సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నాగ వంశీ బ్యానర్‌లో కిరణ్ అబ్బవరం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం మంచి దశలో కెరీర్‌ను ముందుకు సాగిస్తున్న టాలీవుడ్ యువ నటుల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. 'రాజా వారు రాణి గారు' చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆయన తొలి సినిమాతోనే మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన కిరణ్‌కు కొన్ని సినిమాల ద్వారా మంచి విజయాలు కూడా దక్కాయి. ఇక తాజాగా ఈ యువ హీరో 'చెన్నై లైఫ్ స్టోరీ' సినిమాలో హీరోగా నటించాడు. ఈ చిత్రం జూలై 24న విడుదల కానుండగా, దీనిపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కిరణ్ అబ్బవరం తదుపరి సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, కిరణ్ తన తదుపరి చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కిరణ్, నాగ వంశీ మధ్య ఈ సినిమా విషయమై చర్చలు జరిగినట్లు, మరికొన్ని రోజుల్లో ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. నాగ వంశీ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి. అలాంటి బ్యానర్‌లో కిరణ్ అబ్బవరానికి అవకాశం దక్కితే, అది ఆయన కెరీర్‌కు మరింత ఉపయోగపడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story