ముగ్గురు హీరోయిన్లతో మన్మథుడి రొమాన్స్

by Sujitha Rachapalli |

కింగ్ నాగార్జున తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో ‘కూలీ’ మూవీలో స్టైలిష్ విలన్‌గా ఆకట్టుకున్న నాగ్ 100వ చిత్రానికి రా కార్తీక్ దర్శకత్వం వహించనున్నారు.

ముగ్గురు హీరోయిన్లతో మన్మథుడి రొమాన్స్
X

దిశ, సినిమా : కింగ్ నాగార్జున తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో ‘కూలీ’ మూవీలో స్టైలిష్ విలన్‌గా ఆకట్టుకున్న నాగ్ 100వ చిత్రానికి రా కార్తీక్ దర్శకత్వం వహించనున్నారు. తమిళంలో ‘నిత్తం ఒరు వానమ్’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన కార్తీక్‌కే తన కెరీర్‌ మైల్‌స్టోన్ మూవీ బాధ్యతల్ని అప్పగించారు నాగ్. ఈ చిత్రంలో ముగ్గురు ఫిమేల్ లీడ్స్‌లో సీనియర్ నటి ‘టబు’ ఒక పాత్రలో కనిపించనుండగా.. ‘లవ్ మ్యారేజ్’ ఫేమ్ సుష్మిత భట్ మరొక పాత్రకు ఎంపికైంది. కాగా యాక్షన్, ఫ్యామిలీ, ఎమోషనల్ అంశాలతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

Next Story