- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కళ్యాణి ప్రియదర్శన్ జోరు.. ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్న యంగ్ బ్యూటీ!
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్, జై మెహతా కాంబోలో రాబోతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రళయ్’లో కళ్యాణి హీరోయిన్గా నటిస్తున్నట్లు పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించిన యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్. గతేడాది ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘లోకా: చాప్టర్ 1’ చిత్రం ఏ స్థాయి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళ సినీ పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్గా రికార్డు సృష్టించడంతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్న కళ్యాణి, త్వరలోనే ‘లోకా: చాప్టర్ 2’ షూటింగ్లో పాల్గొనడమే కాకుండా బాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్, జై మెహతా కాంబోలో రాబోతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రళయ్’లో కళ్యాణి హీరోయిన్గా నటిస్తున్నట్లు పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే.
కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో అభిమానులు అయోమయంలో పడిపోయారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఆగస్ట్లో ప్రారంభం కాబోతుందట. సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్తో రూపుదిద్దుకుంటున్న ఈ జాంబీ ప్రపంచంలో, కళ్యాణి కేవలం రొమాంటిక్ సీన్లకే పరిమితం కాకుండా హాలీవుడ్ రేంజ్లో భారీ ఫైట్లు చేయబోతున్నట్లు టాక్. ఈ సాహసోపేతమైన స్టంట్స్ కోసం విదేశీ యాక్షన్ కోచ్ల దగ్గర ఆమె ప్రత్యేక శిక్షణ కూడా పొందుతోందట. హీరో రణ్వీర్ సింగ్ దీపావళి నాటికి మొదటి షెడ్యూల్ పూర్తి చేసి, తన బిడ్డ జననం సందర్భంగా కొన్ని రోజులు లీవ్ తీసుకోనున్నారట. ఆ తర్వాత ఈ సినిమా రెండో షెడ్యూల్ను 2027లో ప్రారంభించేలా మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.






