- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కౌంట్డౌన్ ముగిసింది.. అసలైన ఆట మొదలైందంటూ మూవీ రిలీజ్ అప్డేట్ ఇచ్చిన కయ్యదు లోహర్
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులలో ‘ఐయామ్ గేమ్’ ఒకటి.

దిశ, సినిమా: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులలో ‘ఐయామ్ గేమ్’ ఒకటి. ‘ఆర్డీఎక్స్’ ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దుల్కర్ సల్మాన్ కెరీర్లో మైలురాయి లాంటి 40వ చిత్రంగా రాబోతున్న ‘ఐయామ్ గేమ్’ను తన సొంత నిర్మాణ సంస్థ అయిన వేఫురర్ ఫిలిమ్స్ బ్యానర్పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు దుల్కర్. ఇందులో కయ్యదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఆంటోనీ వర్గీస్, మిస్కిన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మలయాళీల పెద్ద పండుగ అయిన ఓనం సందర్భంగా ఆగస్టు 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై క్లారిటీ ఇస్తూ ఓ స్పెషల్ పోస్టర్ చేసింది హీరోయిన్ కయ్యదు లోహర్. ‘కౌంట్డౌన్ ముగిసింది.. అసలైన ఆట మొదలైంది! అద్భుతమైన ఓనం వేడుకల కోసం ‘ఐ యామ్ గేమ్’ సిద్ధంగా ఉంది. ఈ ఆగస్టు 20న థియేటర్లలోకి వస్తోంది! వెండితెరపై మ్యాజిక్ను వీక్షించడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ సరికొత్త పోస్టర్ను షేర్ చేసింది. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతున్నది.






