ఎప్పుడూ చేయని జానర్‌లో సినిమా చేస్తున్నా.. మేమిద్దరం మరోసారి జతకట్టబోతున్నామంటూ ఆర్జీవీ షాకింగ్ ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-04-11 12:51:07  IST  )

టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.

ఎప్పుడూ చేయని జానర్‌లో సినిమా చేస్తున్నా.. మేమిద్దరం మరోసారి జతకట్టబోతున్నామంటూ ఆర్జీవీ షాకింగ్ ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. పలు పోస్టులతో వివాదాలు సృష్టిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే.. చాలా ఏళ్ల తర్వాత ‘శారీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఓ ఇన్‌స్టాగ్రామ్ అమ్మాయిని ఇందులో హీరోయిన్‌గా పెట్టారు. అయితే ఈ మూవీ ఏప్రిల్ 4న విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఆర్జీవీ తన తదుపరి చిత్రాన్ని ప్రకటిస్తూ ట్విట్టర్‌లో షాకింగ్ పోస్ట్ చేశారు. ‘‘సత్య, కౌన్ స్కూల్ తర్వాత నేను ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది, నేను, బాజ్‌పేయి మనోజ్ మేమిద్దరం చేయని హార్రర్ కామెడీ జానర్ కోసం మరోసారి జతకట్టాము.

నేను హారర్, గ్యాంగ్‌స్టర్, రొమాంటిక్, పొలిటికల్ డ్రామాలు, అడ్వెంచర్ కేపర్‌లు, థ్రిల్లర్‌లు మొదలైనవి చేసాను. కానీ ఎప్పుడూ హార్రర్ కామెడీ చేయలేదు. ఈ చిత్రానికి టైటిల్ పెట్టారు ‘పోలీస్ స్టేషన్ మెయిన్ భూత్’ ట్యాగ్ లైన్: You Can't Kill The Deadతో రాబోతుంది. మనం భయపడినప్పుడు పోలీసుల దగ్గరకు పరిగెత్తుతాము. కానీ పోలీసులు భయపడినప్పుడు ఎక్కడికి పరిగెత్తుతారు? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఘోరమైన ఎన్‌కౌంటర్ హత్య తర్వాత, పోలీసు స్టేషన్ హాంటెడ్ స్టేషన్‌గా మారింది. గ్యాంగ్‌స్టర్ల దెయ్యాల నుండి తప్పించుకోవడానికి పోలీసులందరూ భయంతో పరుగులు తీస్తారు. అత్యాధునిక VFX, వెన్నెముక-చిల్లింగ్ హర్రర్ ఎఫెక్ట్‌లతో, పోలీస్ స్టేషన్ మెయిన్ భూట్ మిమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసే వినోదభరితమైన చిత్రం అవుతుంది’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన వారంతా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Next Story