- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేశా.. మాస్ జాతరపై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రం 'మాస్ జాతర'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రం 'మాస్ జాతర'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు సిద్ధం అయింది. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ కాగా.. ఈ హైప్ మరింత పెంచేశాడు డైరెక్టర్ భాను భోగవరపు. ‘ఇది కల్పిత కథే. అయితే ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. పలువురు రైల్వే పోలీస్ అధికారులను కలిసి వారి అధికారాల గురించి, వారు ఎదుర్కొన్న సంఘటల గురించి తెలుసుకున్నాను. వాటి స్ఫూర్తితో ఈ కథకు తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలు రాసుకోవడం జరిగింది. ఇందులో మాస్ అంశాలు ఉంటాయి. అదే సమయంలో ఒక కొత్త పాయింట్ కూడా ఉంటుంది. రైల్వే పోలీస్ నేపథ్యంలో జరిగే ఈ కథలో క్రైమ్ సన్నివేశాలు కొత్తగా ఉంటాయి. రవితేజనే 'మాస్ జాతర' టైటిల్ చెప్పారు. కథ విన్న తర్వాత వినోదంతో పాటు అన్ని అంశాలు బాగున్నాయి అంటూ ఆయన ఈ టైటిల్ సూచించారు. ఆ టైటిల్ తర్వాత నాపై బాధ్యత మరింత పెరిగింది. మాస్ అంశాలు మరిన్ని జోడించాను. థియేటర్లో ప్రేక్షకులు కొన్ని సర్ప్రైజ్లు చూడబోతున్నారు’ అంటూ తెలిపారు భాను.






