- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్డెస్క్: బాలీవుడ్లో షారుక్ ఖాన్, కాజోల్(Shah Rukh Khan-Kajol) జోడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు హిట్గా నిలిచాయి. ప్రేక్షకుల గుండెల్లో నిలిచే ప్రేమకథల్లో ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ వీరిద్దరి కాంబినేషన్కు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా వచ్చి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిగ్నేచర్ పోజుతో కూడిన కాంస్య విగ్రహాలను రూపొందించారు. లండన్లోని లీసెస్టర్ స్క్వేర్లో ఏర్పాటైన వాటిని షారుక్- కాజోల్ గురువారం ఆవిష్కరించారు. ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ సినిమా ఇదే. ఇంతకుముందు.. ‘హ్యారీ పోటర్’, ‘మేరీ పాపిన్స్’లాంటి కొన్ని హాలీవుడ్ చిత్రాల విగ్రహాలు కొలువుదీరాయి. విగ్రహావిష్కరణ అనంతరం షారుక్ మాట్లాడారు. ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్ అని చెప్పారు. ఇలాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తాయని చెప్పారు. ఈ చిత్రంలో నేను భాగం కావడం నా అదృష్టం అని అన్నారు.






