అఖండ 2 టికెట్ రూ.5 లక్షలు పెట్టి కొన్న ఎమ్మెల్యే

by velandi.Saikiran |

అఖండ 2 సినిమా టికెట్ ను చిత్తూరు కూట‌మి శాసన సభ్యులు గురజాల జగన్ మోహన్ ఏకంగా ఐదు లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు.

అఖండ 2 టికెట్ రూ.5 లక్షలు పెట్టి కొన్న ఎమ్మెల్యే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: నందమూరి బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5 అంటే రేపు రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు ఇవాళ సాయంత్రం పడాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రీమియర్లు రద్దు అయ్యాయి. ఇక రేపే సినిమా రిలీజ్ కానుంది. ఈ మేర‌కు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్ర‌క‌టించింది. అయితే ఇలాంటి నేపథ్యంలో అఖండ 2 సినిమా టికెట్ ను చిత్తూరు కూట‌మి శాసన సభ్యులు గురజాల జగన్ మోహన్ ఏకంగా ఐదు లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు.

నందమూరి బాలయ్యపై తనకు ఉన్న అభిమానాన్ని టికెట్ కొనుగోలు చేసి చాటుకున్నారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య అభిమానుల సంఘం నాయకులందరూ కలిసి, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ను కలిసి టికెట్ అందించారు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. నందమూరి బాలయ్య నటించిన అఖండ 2 సినిమా బంపర్ హిట్ అవుతుందని, ఓ అభిమానిగా సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా అఖండ 2 సినిమాలో నందమూరి బాలయ్య హీరోగా చేయగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా మెరిశారు.

Next Story