- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఓటీటీలోకి వచ్చేసిన ‘గోదారి గట్టుపైన’
by Pulgam srinivas |
‘గోదారి గట్టుపైన’ చిత్రం ఈ రోజు నుంచి ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటించిన చిత్రం ‘గోదారి గట్టుపైన’. ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటించగా, సుదర్శన్, రాజ్కుమార్ కసిరెడ్డి ప్రధాన పాత్రల్లో కనిపించారు. మంచి అంచనాల నడుమ ఈ చిత్రం మే 8న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన తర్వాత ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ రావడంతో డీసెంట్ కలెక్షన్లను రాబట్టింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకోగా, ఈ రోజు నుంచి తమ డిజిటల్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి తీసుకొచ్చింది. దర్శకుడు సుభాష్ చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రానికి నాగ వంశీ కృష్ణ సంగీతం అందించారు. అలాగే ఈ సినిమాను రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై అభినవ్ రావు నిర్మించారు.
Next Story






