పెళ్లై రెండేళ్లైనా నయనతారకు ఆ కోరిక తీరలేదా? అయ్యో పాపం అంటున్న నెటిజన్లు

by Disha Web Desk 6 |
పెళ్లై రెండేళ్లైనా నయనతారకు ఆ కోరిక తీరలేదా? అయ్యో పాపం అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయి గత కొద్ది కాలం నుంచి ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి మంచి పాపులారిటీ తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడు కోలీవుడ్ డైరెక్టర్, నటుడు విఘ్నేష్‌శివన్‌ను ప్రేమించి 2022లో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరు పెళ్లైన మూడు నెలలకే సరోగసీ ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.

అంతేకాకుండా పలు చిక్కులను కూడా ఎదుర్కొని బయటపడ్డారు. ప్రస్తుతం నయన్ వరుస చిత్రాల్లో నటిస్తుండగా.. విఘ్నేష్ డైరెక్షన్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. వీరిద్దరూ షూటింగ్‌ గ్యాప్ దొరికినప్పుడల్లా తమ ఇద్దరు పిల్లలతో కలిసి వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, నయనతారకు పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టినప్పటికీ ఒక కోరిక తీరలేదని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

నయనతారకు కూల్‌గా చాలా ప్లజెంట్‌గా ఉండే ప్రదేశాలు అంటే చాలా ఇష్టమట. అందుకే గ్రీనరీ ఉన్న ప్రదేశంలో ఓ ఫామ్ హౌస్ నిర్మించుకుని అక్కడే భర్త పిల్లలతో లైఫ్‌ను ఎంజాయ్ చేయాలనే కోరిక ఉందని తెలుస్తోంది. కానీ కొన్ని కారణాల వల్ల, సినిమాలతో బిజీ, బిజీగా ఉండటం వల్ల ఆ కోరిక ఇప్పటికీ నెరవేరలేదట. ఏ మాత్రం తీరిక దొరికినా సరే ఫామ్ హౌస్‌ పనిలో పడిపోవాలని చూస్తుందట. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారంతా అయ్యో పాపం అంటున్నారు.

Read More..

శాశ్వతంగా ముంబయిని వీడబోతున్న విరాట్-అనుష్క.. పిల్లలతో ఎక్కడ సెటిల్ అవ్వబోతున్నారంటే?


Next Story

Most Viewed