శాశ్వతంగా ముంబయిని వీడబోతున్న విరాట్-అనుష్క.. పిల్లలతో ఎక్కడ సెటిల్ అవ్వబోతున్నారంటే?

by Disha Web Desk 9 |
శాశ్వతంగా ముంబయిని వీడబోతున్న విరాట్-అనుష్క.. పిల్లలతో ఎక్కడ సెటిల్ అవ్వబోతున్నారంటే?
X

దిశ, సినిమా: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి- అనుష్క శర్మ గురించి సుపరిచితమే. వీరు మొదటి సంతానంలో వామిక అనే పాపకు జన్మనివ్వగా.. రీసెంట్ గా రెండవ సంతానంగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆల్రెడీ బాబుకు ‘అకాయ్’ అని నామకరణం కూడా చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. ఇకపోతే తాజాగా మరోసారి విరాట్-అనుష్క నెట్టింట హాట్ టాపిక్ గా మారారు.

వివాహనంతరం వీరిద్దరు ముంబయిలో నివసిస్తోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా విరుష్క దంపతులు శాశ్వతంగా ముంబయిని వీడి యూకే కు మకాం మార్చబోతున్నారని నెట్టింట జోరుగా చర్చించుకుంటున్నారు. పిల్లలు.. వామిక, అకాయ్ తో కలిసి విరుష్క జంట లండన్ లో సెటిల్ అవ్వబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అనుష్క.. అకాయ్ కు జన్మనిచ్చింది కూడా లండన్ లో అనే సమాచారం.

విరాట్ కోహ్లీ వృత్తిపరమైన కమిట్‌మెంట్ల కోసం రీసెంట్ గా ఇండియాకు తిరిగి వచ్చాడట. ఆ టైమ్‌లో అనుష్క శర్మ మాత్రం పిల్లలతో లండన్‌లోనే ఉందట. ఇవి కాస్త సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ వార్తలపై విరుష్క దంపతులు స్పందించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

Read More..

మంచు లక్ష్మి కాళ్లపై పడిన అభిమాని (వీడియో).. లక్ష ఇవ్వడం వల్లనా లేక సినిమాలు చేయకని అలా చేశాడా?


Next Story

Most Viewed