- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓవైపు సినిమాలు.. మరోవైపు చదువు.. రెండింటినీ బ్యాలెన్స్ చేసిన బ్యూటీలు వీరే..?
చదువుతోపాటు సినిమాల్లో రాణించిన ముద్దుగుమ్మలు వీరే: శ్రీ లీల, సాయి పల్లవి, శివాని రాజశేఖర్ డాక్టర్ చదువును పూర్తి చేయగా, మీనాక్షి చౌదరి డెంటిస్ట్ కోర్సు పూర్తయ్యాక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కావ్య కళ్యాణ్ రామ్ లాయర్ చదువు పూర్తి చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : చదువులో అద్భుతమైన ప్రతిభను కనబరిచి, సినిమాల్లో కూడా అదే స్థాయిలో రాణించిన కొంతమంది నటీమణులు ఉన్నారు. వారు ఎవరో తెలుసుకుందాం.
శ్రీ లీల: పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, సినిమాల్లో నటిస్తూనే తన డాక్టర్ చదువును పూర్తి చేసింది. తాజాగా ఈ బ్యూటీ తన ఎంబిబిఎస్ (MBBS) పట్టా పుచ్చుకుంది. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.
మీనాక్షి చౌదరి: ప్రస్తుతం జెట్ స్పీడుగా కెరీర్ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ, బ్యాచిలర్ ఆఫ్ డెంటిస్ట్ కోర్సును కంప్లీట్ చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది.
సాయి పల్లవి: జార్జియాలో డాక్టర్ కోర్సు పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా కెరియర్ ఏమాత్రం డౌన్ ఫాల్ అయినా, చక్కగా డాక్టర్ ప్రాక్టీస్ చేసి ఎంతో మందికి వైద్యం చేస్తానని కూడా సాయి పల్లవి గతంలో చెప్పుకొచ్చింది.
శివాని రాజశేఖర్: ఈ బ్యూటీ కూడా ఎంబిబిఎస్ (MBBS) కోర్సును పూర్తి చేసింది.
కావ్య కళ్యాణ్ రామ్: బలగం సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ లాయర్ చదువును పూర్తి చేసింది.






