- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీక్వెల్ చేయాలన్న ఉద్దేశం లేదు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
సూర్య ‘కరుప్పు’ ప్రమోషన్స్లో డైరెక్టర్ ఆర్జే బాలాజీ

దిశ, సినిమా: సూర్య తన మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘కరుప్పు’ కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. త్రిష హీరోయిన్. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ సంచలనం క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే రీసెంట్గా ఈ సినిమాను మే 14న వరల్డ్ వైడ్ గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటిస్తూ సూర్య ఇంటెన్స్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే అప్పుడే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు చిత్ర బృందం. ఇందులో భాగంగా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ ఆర్జే బాలాజీ ‘మూకుతి అమ్మన్ 2’కు సీక్వెల్గా ‘కరుప్పు’ తెరకెక్కుతుందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. ‘‘మూకుతి అమ్మన్’ సినిమాకు సీక్వెల్ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ, నిర్మాతలు, నయనతార చేయాలని అనుకున్నారు. అందుకే సుందర్.సి దర్శకత్వంలో దానిని స్టార్ట్ చేశారు. ‘మూకుతి అమ్మన్’ కథకు ‘కరుప్పు’కు ఎలాంటి సంబంధం లేదు. ఇది టోటల్గా సెపరేట్ మూవీ’ అని తెలిపారు.






