Dil Raju: ఆ సినిమా విషయంలో దర్శకుడి ప్లాన్ మొత్తం మార్చేశాను.. రిజల్ట్ చూసి అంతా షాక్

by Pulgam srinivas |

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను మొదట కొత్త నటీనటులతో తెరకెక్కించాలని శ్రీకాంత్ అడ్డాల భావించగా, స్టార్ హీరోలు ఉంటేనే బెటర్ అని దిల్ రాజు సూచించినట్లు తెలిపారు.

Dil Raju: ఆ సినిమా విషయంలో దర్శకుడి ప్లాన్ మొత్తం మార్చేశాను.. రిజల్ట్ చూసి అంతా షాక్
X

దిశ, వెబ్ డెస్క్: దిల్ రాజు తన కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఆయన నిర్మించిన చిత్రాల్లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయిన సినిమాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఒకటి. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా నటించగా అంజలి, సమంత హీరోయిన్లుగా కనిపించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు.

ఈ చిత్రం 2013 సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమా ప్రారంభానికి ముందు జరిగిన ఆసక్తికర విషయాన్ని దిల్ రాజు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. శ్రీకాంత్ అడ్డాల 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కథ రాసుకున్న తర్వాత ఈ సినిమాను పూర్తిగా కొత్త నటీనటులతో తెరకెక్కించాలని అనుకున్నారు. అందులో భాగంగా నా దగ్గరకు వచ్చి కథ వినిపించారు. కథ మొత్తం విన్నాక కొత్త వాళ్లతో ఈ సినిమా వర్కౌట్ కాదని, స్టార్ హీరోలు ఉంటేనే మరింత బాగుంటుందని నేను సూచించాను.

దాంతో శ్రీకాంత్ ఇప్పటికే వెంకటేష్ గారు కథ విని పాజిటివ్‌గా స్పందించారు. ఇంకో స్టార్ హీరోగా ఎవరిని తీసుకుంటే బాగుంటుంది? అని అడిగారని దిల్ రాజు చెప్పారు. అప్పుడే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలను ప్రయత్నిద్దామని సూచించినట్లు తెలిపారు. ఆ తర్వాత అనుకోకుండా మహేష్ బాబుకు ఈ కథ గురించి చెప్పగా, ఆయన స్టోరీ విని “వెంకటేష్ గారు చేస్తే నేను కచ్చితంగా ఈ సినిమా చేస్తాను” అని చెప్పారు. అలా పూర్తిగా కొత్త నటీనటులతో అనుకున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు చేరినట్లు ఆయన వివరించారు. అలాగే ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించిందని ఆయన చెప్పుకొచ్చారు.

Next Story