పదేళ్ల నిశ్శబ్దానికి తెర.. మెట్ గాలాలో సంచలనం..!

by Bhanu |

ఒక దశాబ్దం పాటు బాలీవుడ్ కారిడార్లలో గుసగుసలాడిన ఒక ప్రేమకథ.. తెర వెనుక ఎన్నో మలుపులు తిరిగిన ఒక బంధం.. మెట్ గాలా 2025 వేదికగా మళ్లీ వెలుగులోకి వచ్చింది.

పదేళ్ల నిశ్శబ్దానికి తెర.. మెట్ గాలాలో సంచలనం..!
X

దిశ, వెబ్ డెస్క్: ఒక దశాబ్దం పాటు బాలీవుడ్ కారిడార్లలో గుసగుసలాడిన ఒక ప్రేమకథ.. తెర వెనుక ఎన్నో మలుపులు తిరిగిన ఒక బంధం.. మెట్ గాలా 2025 వేదికగా మళ్లీ వెలుగులోకి వచ్చింది. షారుఖ్ ఖాన్ - ప్రియాంక చోప్రా కలిసి రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టడంతో కేవలం ఫ్యాషన్ ప్రపంచమే కాదు, యావత్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 2011-2012 నుంచి వీరిద్దరూ బహిరంగంగా కనిపించకపోవడం ఎన్నో ప్రశ్నలకు తావిచ్చింది. ఒకప్పుడు హాట్ టాపిక్‌గా మారిన వారి అఫైర్ పుకార్లు, గౌరీ ఖాన్‌తో విభేదాలు, ప్రియాంక బాలీవుడ్‌లో వివక్షకు గురైందన్న ఆరోపణలు.. ఈ నిశ్శబ్దానికి కారణాలేంటో ఎవరికీ తెలియదు.

అయితే, కాలం గడిచినా వారి గురించిన ఆసక్తి మాత్రం తగ్గలేదు. మెట్ గాలాలో షారుఖ్ తన సిగ్నేచర్ 'K' పెండెంట్‌తో కూడిన బ్లాక్ సూట్‌లో రాయల్‌గా కనిపించగా, ప్రియాంక ఓల్డ్ హాలీవుడ్ గ్లామర్‌తో మెరిసిపోయింది. నిక్ జోనాస్‌తో ఆమె రాక మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది కేవలం ఇద్దరు స్టార్లు కలిసి నడవడం కాదు.. ఒక చరిత్ర పునరావృతం కావడం..

ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ఫ్యాషన్ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు దిగ్గజాలు ఎదురుపడితే ఏం జరుగుతుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. వారి మధ్య మాటలుంటాయా? కేవలం వృత్తిపరమైన నవ్వులుంటాయా? లేక ఒకరినొకరు పట్టించుకోకుండా వెళ్లిపోతారా? అని

కెమెరాలు వారి తారల వెలుగును బంధిస్తుండగా, వారిద్దరి మధ్య క్షణికమైన స్పందన కోసం ప్రపంచం వేచి చూసింది. పదేళ్ల తర్వాత వారు కలిసి కనిపించడమే ఒక సంచలనం. కొన్ని బాలీవుడ్ కథలు తెరమరుగైనా వాటి మ్యాజిక్ ఎప్పటికీ తగ్గదని, ముఖ్యంగా ఇలాంటి గ్లామరస్ వేదికలపై అవి మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయని ఈ సంఘటన నిరూపించింది. వారి మధ్య ఏం జరిగిందనేది కాలమే చెప్పాలి, కానీ ఈ కలయిక మాత్రం ఇంటర్నెట్‌ను షేక్ చేయడంలో సందేహం లేదు..


Next Story