- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SSMB-29పై బిగ్ అప్డేట్స్.. ఆ షూట్ పూర్తి కాగానే వేసవి సెలవులు ఎంజాయ్ చేయనున్న మహేశ్ బాబు!
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ‘SSMB-29’ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇందులో బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయినట్లు తెలుస్తుండగా.. తాజాగా ఈ సినిమా షూటింగ్కు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘SSMB-29’ షూటింగ్ ప్రస్తుతం శంకరపల్లి (Shankarapalli) శివార్లలో వేసిన సెట్లో జరుగుతుందని సమాచారం. ఇందులో మహేశ్ బాబు, ప్రియాంకా చోప్రాపై ఓ పాటను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ షెడ్యూల్ అనంతరం మహేశ్ బాబు నెలరోజులు పాటు వేసవి సెలవలు తీసుకోబోతున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్ కాగా.. ‘మహేశ్ అన్నకు తన సినిమాలతో పాటు ఫ్యామిలీకి టైమ్ ఇవ్వడం కూడా తెలుసు.. అందుకోసం పక్కాగా ప్లాన్ చేసుకుంటాడు’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్. కాగా.. మహేశ్ బాబు షూటింగ్లో గ్యాప్ దొరికిన ప్రతిసారి తన ఫ్యామిలీతో టూర్స్ ఎంజాయ్ చేస్తాడనే విషయం అందరికి తెలిసిందే.






