- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సమ్మర్ స్పెషల్గా ‘భైరవం’.. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ మంచు మనోజ్ కీలక ట్వీట్

దిశ, సినిమా: యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్(Manoj), నారా రోహిత్(Nara Rohit) కాంబోలో రాబోతున్న మల్టీ స్టారర్ మూవీ ‘భైరవం’. విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను శ్రీసత్య సాయి ఆర్ట్స్ బ్యానర్పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. అయితే ఇందులో నటి ప్రియమణి, జయసుధ కీలక పాత్రలో నటిస్తుండగా.. దివ్య పిళ్లై, అదితి శంకర్(Aditi Shankar), ఆనంది హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, మూవీ మేకర్స్ ‘భైరవం’(Bhairavam) రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ సినిమా మే 30న వరల్డ్ వైడ్గా విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు. అలాగే నారా రోహిత్, మంచు మనోజ్ శ్రీనివాస్ను ఎత్తుకున్న పోస్టర్ను షేర్ చేశారు.
ఇక ఈ పోస్ట్కు ‘‘ఈ వేసవిలో, మరెక్కడా లేని సినిమా అనుభవానికి సిద్ధంగా ఉండండి! ‘భైరవం’ మే 30న ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్క్రీన్లలో విడుదలవుతుందని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము! యాక్షన్, భావోద్వేగం, విడదీయరాని సోదర స్ఫూర్తితో నిండిన ఒక ఇతిహాస ప్రయాణానికి సిద్ధం. నాకు, నా పుట్టినరోజు నెలలో విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పటివరకు లభించిన అత్యుత్తమ బహుమతిగా భావిస్తున్నా. మీ అందరితో పంచుకోవడానికి నేను వేచి ఉండలేను. ఈ మైలురాయిని జరుపుకుంటున్నప్పుడు, మన సైనికుల ధైర్యం, త్యాగాన్ని గౌరవించడానికి కూడా మేము కొంత సమయం కేటాయించాలనుకుంటున్నాము. వారి అచంచల ధైర్యం మన భద్రతను నిర్ధారిస్తుంది. కథలను సృష్టించడం, పంచుకోవడం కొనసాగించడానికి మాకు వీలు కల్పిస్తుంది. స్థితిస్థాపకత ఐక్యత, స్ఫూర్తిని జరుపుకోవడంలో మాతో చేరండి’’ అని రాసుకొచ్చాడు.