కొంత మంది హీరోలను చూసి ఇన్‌స్పైర్ అయ్యి రెండు మూడు పెళ్ళిళ్ళు చేస్కుందాం అనుకుంటున్నా.. షాకింగ్‌గా యంగ్ హీరో కామెంట్స్

by Chukka Sudharani |

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్ (Manchu Manoj), నారా రోహిత్ (Nara Rohit) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘భైరవం’.

కొంత మంది హీరోలను చూసి ఇన్‌స్పైర్ అయ్యి రెండు మూడు పెళ్ళిళ్ళు చేస్కుందాం అనుకుంటున్నా.. షాకింగ్‌గా యంగ్ హీరో కామెంట్స్
X

దిశ, సినిమా: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్ (Manchu Manoj), నారా రోహిత్ (Nara Rohit) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తు్న్న ఈ చిత్రం మే 30 వరల్డ్ వైడ్‌గా థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. ‘భైరవం’ నుంచి అప్‌డేట్స్ ఇవ్వడంతో పాటు వరుస ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు మూవీ యూనిట్. ఇందులో భాగంగా యాంకర్ సుమ పెళ్లి గురించి ప్రశ్నించగా.. మాటల మాటల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘కొంత మంది హీరోలని చూసి ఇన్‌స్పైర్ అయ్యి రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుందాం అనుకుంటున్నాను’ అంటూ కామెంట్స్ చేస్తాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ‘PK ఫ్యాన్స్ బి లైక్: నువ్వేంటీ మా హీరో గురించి మాట్లాడుతున్నావు’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా.. ‘భైరవం’ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియమణి, జయసుధ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. దివ్య పిళ్లై, అదితి శంకర్, ఆనంది హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Next Story