- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేను.. నాగార్జున ఎమోషనల్ పోస్ట్
తన జీవితంలో మే 23 ఎప్పటికీ ప్రత్యేకమైనది అంటూ ఎమోనల్ ట్వీట్ షేర్ చేశాడు స్టార్ హీరో అక్కినేని నాగార్జున.

దిశ, సినిమా: తన జీవితంలో మే 23 ఎప్పటికీ ప్రత్యేకమైనది అంటూ ఎమోనల్ ట్వీట్ షేర్ చేశాడు స్టార్ హీరో అక్కినేని నాగార్జున. తన మొదటి అడుగు ‘విక్రమ్’ చిత్రం 1986 మే 23 న రిలీజ్ కాగా.. నేటితో 40 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆయన అభిమానులకు ధన్యవాదాలు తెలుపారు. ‘ఈ రోజు నాపై కురిపిస్తున్న ఆశీర్వాదాలకు, ప్రేమకు మీ అందరికీ ధన్యవాదాలు. మే 23!! నేను ఎప్పటికీ మరువలేని తేదీ ఇది!! నా దిగ్గజ తండ్రి ANR గారి చివరి చిత్రం 'మనం'ను నిర్మించి విడుదల చేసే అరుదైన గౌరవం నాకు దక్కిన రోజు ఇది. నా తండ్రితోనూ, నా కుమారులతోనూ కలిసి పనిచేసే అదృష్టం నాకు లభించిన చిత్రం అది. ఎన్నో ఏళ్ల క్రితం, ఇదే మే 23 తేదీన నా మొదటి చిత్రం 'విక్రమ్'ను విడుదల చేసే అవకాశం కూడా నాకు లభించింది. మీ అందరినీ అలరించే, మీ ఆశీర్వాదాలను, ప్రేమను పొందే అదృష్టం నాకు దక్కిన రోజు అది. ఇన్ని ఏళ్లుగా నా వెన్నంటి నిలిచిన అభిమానులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరిన్ని 'మే 23'లు నా జీవితంలో రావాలని ఆశిస్తున్నాను’ అంటూ తెలిపారు. కాగా.. నాగార్జున హీరోగా ముధుసుధనరావు తెరకెక్కించిన ‘విక్రమ్’ చిత్రం 1986 మే 23న విడుదలై విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కింగ్ తన కెరీర్లో మైలురాయి అయినా 100 వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. కాగా.. 1986లో ఇదే రోజున ‘విక్రమ్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ్, తర్వాత అదే తేదీన వచ్చిన ‘మనం’ మూవీతో అక్కినేని కుటుంబం 3 జనరేషన్స్ని ఒకే స్క్రీన్పై చూపించారు. ANR గారి చివరి సినిమా కూడా ఇదే కావడం ఈ రోజును మరింత ఎమోషనల్గా మార్చింది.






