ఏడుగురు హీరోయిన్లతో భారీ అడ్వెంచర్ మూవీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన క్రిష్

by Pulgam srinivas |

క్రిష్ జాగర్లమూడి ఏడుగురు హీరోయిన్లతో ట్రెక్కింగ్‌ అడ్వెంచర్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. తాజాగా వీటిపై క్రిష్ స్పందిస్తూ... నేను ప్రస్తుతం ఏడుగురు హీరోయిన్లతో ఏ సినిమానూ ప్లాన్ చేయడం లేదు అని స్పష్టతనిచ్చాడు.

ఏడుగురు హీరోయిన్లతో భారీ అడ్వెంచర్ మూవీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన క్రిష్
X

దిశ, వెబ్ డెస్క్ : గమ్యంతో దర్శకుడిగా పరిచయం అయిన క్రిష్ జాగర్లమూడి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో రూపొందిన చాలా చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. క్రిష్ కమర్షియల్ సబ్జెక్ట్స్ జోలికి పోకుండా వైవిధ్యమైన మూవీలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వెళ్ళాడు. దాంతో ఆయనకంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. కెరియర్ ప్రారంభంలో మంచి దర్శకుడిగా క్రేజ్ ను సంపాదించుకున్న ఈయన ఈ మధ్యకాలంలో మాత్రం ప్రేక్షకులను పెద్ద ఎత్తున నిరుత్సాహపరుస్తూ వస్తున్నాడు.

చాలా కాలం క్రితం ఈయన దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు స్టార్ట్ అయింది. కానీ అనేక కారణాలవల్ల ఈ సినిమా ఆలస్యమైంది. దాంతో ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతల నుండి ఈ దర్శకుడు తప్పుకున్నాడు. కొంత కాలం క్రితం క్రిష్ 'ఘాటి' సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. గత కొన్ని రోజులుగా క్రిష్ నెక్స్ట్ మూవీకి సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది.

ఈ దర్శకుడు ఏడుగురు టాప్ హీరోయిన్లతో భారీ బడ్జెట్ తో ట్రెక్కింగ్ అడ్వెంచర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు, ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు ఓ వార్త వైరల్ అయింది. తాజాగా ఈ వార్తపై క్రిష్ స్పందించాడు... "ఏడుగురు హీరోయిన్లతో భారీ బడ్జెట్ తో ట్రెక్కింగ్ అడ్వెంచర్ మూవీ ఐడియా సూపర్ గా ఉంది. కానీ ప్రస్తుతం నేను అలాంటి కథపై పని చేయడం లేదు. ఇవన్నీ కేవలం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పుకార్లు మాత్రమే. నేను ఏదైనా సినిమాకి కమిట్ అయితే దానికి సంబంధించిన అధికారిక ప్రకటనను స్వయంగా నేనే విడుదల చేస్తాను" అని క్రిష్ తాజాగా తెలియజేశాడు.

Next Story