- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ ఖర్చుతో ‘ఆదర్శ కుటుంబం’ ఇంటర్వెల్ సీక్వెన్స్
ప్రస్తుతం 'ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47' చిత్ర బృందం ఓ భారీ సెట్లో ఇంటర్వెల్ సన్నివేశానికి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ప్రస్తుతం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా, యంగ్ హీరో నారా రోహిత్ మరియు తమిళ నటుడు యోగి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 40 శాతం వరకు పూర్తయినట్లు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ 2 — మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ చిత్ర బృందం ఓ భారీ సెట్లో ఇంటర్వెల్ సన్నివేశానికి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ ఫైట్ సీక్వెన్సులు ఈ చిత్రానికే హైలెట్గా నిలవనున్నాయని టాక్ వినిపిస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. చాలా ఏళ్ల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు, స్క్రీన్ప్లే అందించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాల్లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించి మంచి విజయాలు అందుకున్నారు. ఇక చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.






