- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT Platforms Ban : 5 ఫేమస్ ఓటీటీలను బ్యాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం..
అశ్లీలత కంటెంట్ ఎక్కువగా ఉందని మూడ్ఎక్స్ వీఐపీ, కోయల్ ప్లేప్రో, డిజి మూవీప్లెక్స్, ఫీల్, జుగ్ను ఓటీటీలను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ బ్యాన్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : కరోనాకు ముందు వరకు ఇండియాలో ఓటీటీ ప్లాట్ఫారమ్ల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కొన్ని ఓటీటీలు ఉన్నా కూడా వాటికి ప్రేక్షకాదరణ కూడా పెద్దగా ఉండేది కాదు. అందుకు ప్రధాన కారణం ఆ సమయంలో ప్రేక్షకులు ఎక్కువ శాతం ఏదైనా కొత్త సినిమా వస్తే థియేటర్లలో చూడడానికి, ఆ తర్వాత టీవీలో చూడడానికి ఆసక్తిని చూపించేవారు. డబ్బు పెట్టి ఓటీటీ సబ్స్క్రిప్షన్ కొనుగోలు చేసి, అందులో ఉండే కంటెంట్ను చూసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది.
ఎప్పుడైతే దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిందో ఆ సమయంలో థియేటర్లు చాలా కాలం బంద్ కావడం, అలాగే టీవీల్లో కూడా కొత్త కంటెంట్ కరువు కావడంతో ఓటీటీలోని కంటెంట్కు ప్రేక్షకులు అలవాటు పడిపోయారు. ఆ తర్వాత విచ్చలవిడిగా ఈ సంస్థలు కూడా పుట్టుకొచ్చాయి. వాటిలో కొన్ని అశ్లీలత ఎక్కువగా ఉన్న కంటెంట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాయి. కేవలం అశ్లీల కంటెంట్పైనే ఆధారపడిన కొన్ని ఓటీటీ సంస్థలను తాజాగా కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది.
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తాజా నివేదికల ప్రకారం మూడ్ఎక్స్ వీఐపీ, కోయల్ ప్లేప్రో, డిజి మూవీప్లెక్స్, ఫీల్, జుగ్ను అనే ఐదు ఓటీటీ సంస్థలను బ్యాన్ చేయాలని కేంద్రం ఆదేశాలను జారీ చేసింది. అన్ని చట్టపరమైన విధి విధానాలను అనుసరించి ఈ ఐదు ఓటీటీలపై కఠిన చర్యలు తీసుకున్నామని కేంద్రం నివేదించింది. అశ్లీలత ఎక్కువగా ఉన్న ఐదు ఓటీటీలను కేంద్రం బ్యాన్ చేయడంతో అలాంటి కంటెంట్ ఇకపై ఓటీటీలలో ఎక్కువగా ఉండకుండా సదరు సంస్థలు జాగ్రత్త పడతాయని అనేకమంది అభిప్రాయపడుతున్నారు.






