ఆందోళనలో రేఖ.. ఏమైందంటే..?

by  |
ఆందోళనలో రేఖ.. ఏమైందంటే..?
X

కరోనా వైరస్ దేశంలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎవ్వరినీ కూడా వదలడంలేదు. తాజాగా ప్రముఖ నటి రేఖ సెక్యూరిటీ గార్డ్ కి కరోనా సోకింది. దీంతో ఆమె తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెసింది. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆమె బంగ్లాను మొత్తం శానిటైజ్ చేశారు. భవనం వెలుపల కంటైన్మెంట్ జోన్ గా నోటిస్ కూడా అంటించారు. రేఖ ఇంటికి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఎప్పుడూ ఉంటారు. వారిలో ఒకరికి కరోనా సోకింది. దీంతో మిగతా సిబ్బందికి కూడా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రేఖ ఇంటి పక్కనే ఉన్న లిరిసిస్ట్ జావేద్ అక్తర్ బిల్డింగ్ లో కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.



Next Story