టీడీపీ నేతలపై కొనసాగుతున్న సీఐడీ విచారణ

by  |
టీడీపీ నేతలపై కొనసాగుతున్న సీఐడీ విచారణ
X

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంపై దాడి ఘటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీల సవాళ్లు ప్రతిసవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచింది. అంతేగాకుండా ఏపీ రాజకీయాలు ప్రస్తుతం రామతీర్ధం రామాలయం చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా ఈ దాడి ఘటనపై సీఐడీ అధికారుల విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రామతీర్థం మాజీ సర్పంచ్ భర్త తిరుపతిరావును విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story