రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణ

by  |
రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని విజయనగరం జిల్లాలో రామతీర్థం రామాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఐడీ విచారణకు ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు ఆదేశించింది. ఇవాళ సాయంత్రం ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ స్థానిక పోలీసు అధికారులతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఈ ఘటనకు సంబంధించి రెండ్రోజుల్లో అరెస్టులు జరుగుతాయని మంత్రి ప్రకటించారు. నెల రోజుల్లోగా రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా 24వేల దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులను మంత్రి వెల్లంపల్లి ఆదేశించారు.

Next Story

Most Viewed