- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, దుబ్బాక : సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఐ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో గ్రామస్తులంతా ఆందోళనకు దిగారు. సీఐ కార్యాలయం ఆవరణలో ఒక్కసారిగా ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులకు బాధితులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. గత రాత్రి దుబ్బాక మండలం నర్లంగిగడ్డ గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఆడుకుంటున్న మహిళల పట్ల గ్రామానికి చెందిన ఎమ్మ నవీన్ అనే వ్యక్తి ‘మా ఇంటి ముందు ఎందుకు ఆడుతున్నారు’ అంటూ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని, చెప్పుకోలేని బూతు మాటలతో తిట్టాడని బాధిత మహిళ భర్త దుబ్బాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చినట్లు సమాచారం.
అయితే తన ఫిర్యాదును పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు సీఐ హరికృష్ణ గౌడ్ తిట్టాడని మహిళా భర్త ఆరోపించారు. పోలీసులు తిట్టారని మనస్తాపానికి గురైన సదరు వ్యక్తి తమకు న్యాయం జరగాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు. అతని ఆత్మహత్యయత్నాన్ని అడ్డుకున్న పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీస్ జూలూం నశించాలి అంటూ సీఐ కార్యాలయం ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో సుమారు అరగంట పాటు సీఐ కార్యాలయం ఎదుట ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న సిద్దిపేట ఏసీపీ దేవా రెడ్డి వెంటనే దుబ్బాక పోలీస్ స్టేషన్కు చేరుకొని బాధితులను సముదాయించారు. అయినప్పటికీ పోలీసుల మాట ససేమిరా అన్న బాధితులు సీఐ కార్యాలయం ఎదుట బైఠాయించారు.