- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ,వెబ్డెస్క్ :
ఆ మహిళ కుటుంబం హిందూ ధర్మం పాటిస్తోంది. ఇంటి పక్కన అన్యమతస్థులు (క్రిస్టియన్స్) ఉంటున్నారు.ఈ క్రమంలోనే ఉదయం వేళ మహిళ పూజ చేస్తుండగా ‘గంట’ శబ్దం వినిపించింది. దీంతో పక్కింట్లో ఉండే వ్యక్తి మహిళపై దాడి చేశాడు. దీంతో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. పాండురంగనగర్లో నివాసముంటున్న కవిత అనే మహిళ కుటుంబానికి పొరుగునే యేసు అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఇరు కుటుంబాలకు మధ్య కొంతకాలంగా వివాదాలు ఉన్నాయి. దీంతో తరచుగా గొడవపడుతుండేవారు. ఈ క్రమంలోనే కవిత పూజ చేస్తున్న సమయంలో గంట శబ్దం ఎక్కువగా వచ్చిందని.. అది తమకు ఇబ్బందిగా మారిందని యేసు గొడవకు దిగాడు. దీంతో కవిత కూడా గొడవకు దిగింది. మాటామాటా పెరగడంతో యేసు కర్రతో కవిత తలపై బలంగా కొట్టడంతో గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని యేసును అదుపులోకి తీసుకున్నారు.