రఘురామకు క్రైస్తవ సంఘాలు వార్నింగ్ 

by  |
రఘురామకు క్రైస్తవ సంఘాలు వార్నింగ్ 
X

దిశ, వెబ్ డెస్క్: క్రైస్తవులపై ఎంపీ రఘురామకృష్ణారాజు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్, క్రిష్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా తుమ్మలపల్లిలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. క్రైస్తవులు, హిందువుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా రఘురామకృష్ణారాజు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టడం సబబు కాదని, వైసిపి సర్కారు అన్ని మతాలను సమన్యాయం చేస్తోందని తెలిపారు. వైసీపీ ఎంపీగా ఉంటూ బీజేపీ అంటకాగుతూ ఇష్టానుసారం వ్యాఖ్యల్ని చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్టంలోని క్రైస్తవులమంతా సీఎం జగన్ కి అండగా ఉంటామని చెప్పారు. రాష్ట్రంలో క్రైస్తవులు, హిందువులు సోదరభావంతో ఉన్నారని.. మత విద్వేషాలు రెచ్చగొడితే ఆయన నియోజవర్గంలోని దళిత క్రైస్తవులు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.



Next Story