- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, చిట్యాల: కరోనా రోగులకు భోజనవసతి కల్పించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల పోలీసులు మానవత్వం చాటుకున్నారు. లాఠీలు చేత పట్టి కఠినంగా వ్యవహరించడం మాత్రమే కాదని, తమలో కూడా మానవత్వం ఉంటుందని చిట్యాల పోలీసులు నిరూపించారు. చిట్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లకు లాక్డౌన్ ముగిసేవరకు గుంటూరుపల్లి గ్రామానికి చెందిన శాకమూరి అమర్ భోజన వసతిని కల్పిస్తున్నట్లు ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు తెలిపారు.ఈ మేరకు స్థానిక ఆస్పత్రిలో భోజనాలను పోలీస్, ఆసుపత్రి సిబ్బందితో కలిసి శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. లాక్డౌన్ వల్ల కరోనా పేషెంట్లకు వారి కుటుంబ సభ్యులకు బయట భోజనాలు దొరకడం లేదని, వారికి పోలీస్ శాఖ సహకారంతో భోజనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డాక్టర్ ప్రసన్, పోలీస్, ఆసుపత్రి సిబ్బంది శంకర్, కమలాకర్, నరేందర్, కిరణ్ పాల్గొన్నారు.