అమెరికాలో చిత్తూరు గృహిణి అనుమానాస్పద మృతి..

by  |
అమెరికాలో చిత్తూరు గృహిణి అనుమానాస్పద మృతి..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ రాష్ట్రం చిత్తూరు జిల్లాకు చెందిన హేమలత అనే గృహిణి అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె స్వస్థలం పూతలపట్టు మండలం బదార్లపల్లి గ్రామం. 2016లో సుధాకర్ అనే వ్యక్తితో హేమలతకు వివాహం జరిగింది. వారికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలోనే హేమలత అనుమానాస్పదంగా చనిపోయింది.

కూతురు మృతిపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బాధిత తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అనంతరం మృతదేహాన్ని త్వరగా ఇండియాకు రప్పించాలని అధికార యంత్రాంగాన్ని కోరారు.


Next Story

Most Viewed