రోశయ్య సేవలు నేటితరం ప్రజాప్రతినిధులకు మార్గదర్శనం

by  |
roshaiah
X

దిశ, పటాన్‌చెరు: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు పటాన్‌చెరు మండలం చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు నివాళులర్పించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు ఎల్లవేళలా గుర్తుంటాయని అన్నారు. ఆయన అందించిన సేవలు నేటితరం ప్రజాప్రతినిధులకు, నాయకులకు మార్గదర్శకాలుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

Next Story

Most Viewed