స్టార్ క్రికెటర్ తో మెగాస్టార్ డిన్నర్.. పిక్స్ వైరల్

by  |
స్టార్ క్రికెటర్ తో మెగాస్టార్ డిన్నర్.. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్ దేవ్‌తో కలిసి డిన్నర్ చేసిన ఫొటోలు షేర్ చేశారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలస్‌ ఇందుకు వేదిక కాగా.. చిరు వైఫ్ సురేఖ కూడా వీరితో జాయిన్ కావడం విశేషం. కాగా ఈ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన చిరు.. “చాలా రోజుల తర్వాత పాత మిత్రుడు కపిల్ దేవ్‌తో వండర్‌ఫుల్ మీటింగ్” అంటూ ట్వీట్ చేశారు. ఫలక్‌నుమా ప్యాలస్ సెట్టింగ్ మరింత స్పెషల్‌గా ఉందన్న చిరు.. గతానికి తీసుకెళ్లి జ్ఞాపకాలను నెమరేసుకునేలా చేసిందని వెల్లడించారు. మనకు ఫస్ట్ వరల్డ్ కప్ అందించిన ‘హర్యానా హరికేన్’ తనకు ఆత్మీయ మిత్రుడని పేర్కొన్నారు.

సినిమాల విషయానికొస్తే.. చిరు, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆచార్య’ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక మిడిల్ ఏజ్డ్ నక్సలైట్.. సామాజిక సంస్కర్తగా మారి ఆలయాల నిధుల దుర్వినియోగంపై ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌పై ఏవిధంగా పోరాడాడన్న కథాంశంతో సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. పూజా హెగ్డే రామ్ చరణ్‌కు జోడీగా కనిపించనుంది.



Next Story

Most Viewed