‘SBSB’ టీంకు మెగాస్టార్ విషెస్

by  |
‘SBSB’ టీంకు మెగాస్టార్ విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది. లాక్ డౌన్ తర్వాత తెలుగు ఇండస్ట్రీ నుంచి విడుదలవుతున్న తొలి చిత్రం ఇదే కాగా మెగాస్టార్ చిరంజీవి మూవీ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ చిత్రానికి లభించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమలోనే స్ఫూర్తిని, స్థైర్యాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదన్నారు. ప్రేక్షకులందరూ బాధ్యతగా ఫేస్ మాస్క్‌లు ధరించి, సామాజిక దూరాన్ని పాటిస్తూ సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని థియేటర్స్‌లో ఎంజాయ్ చేయాలని కోరారు. మెగాస్టార్ విష్‌పై స్పందించిన తేజ్ కృతజ్ఞతలు తెలిపారు. మీ సపోర్ట్, బ్లెస్సింగ్స్ తమకెప్పుడూ ఉండాలని కోరాడు.



Next Story

Most Viewed